తిరుమల లడ్డూ
Actor ProfilePolitician

తిరుమల లడ్డూ

Total News1
Movie Updates0
Sources1
తిరుమల లడ్డూపై టీటీడీ తాజా ఒప్పందం
Oneindia Telugu16 Jun 2026
తిరుమల లడ్డూపై టీటీడీ తాజా ఒప్పందం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు 95,094 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 35,909 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.93 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది.టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.66 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. రికార్డు స్థాయిలో 3.23 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీని అందిస్తున్నారు. అదనపు షెడ్లను అమర్చారు.శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీపై టీటీడీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మైసూరుకు చెందిన సీఎస్ఐఆర్- సెంట్రల్ ఫుడ్ టెక్నాలాజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. లడ్డూతో పాటు శ్రీవారి ప్రసాదాల తయారీ, పంపిణీ ప్రక్రియలో అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత, పోషక విలువలను నిర్ధారించడంతో పాటు వాటి సంప్రదాయ స్వరూపాన్ని పరిరక్షించేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.బెంగళూరులో నిర్వహించిన రెండు రోజుల రైజ్ కాంక్లేవ్ సదస్సులో ఈ ఒప్పందం కుదిరింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార భద్రత శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో టీటీడీ, సీఎస్ఐఆర్ ప్రతినిధులు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సదస్సులో టీటీడీ తరఫున ప్రోక్యూర్మెంట్ జీఎం ఉమా శంకర్ పాల్గొన్నారు. దేశంలోని దేవాలయాలకు సంబంధించి ఈ తరహా ఒప్పందం కుదరడం ఇదే తొలిసారి కావడం విశేషం.దీనివల్ల తిరుమల లడ్డూ, ఇతర ప్రసాదాల నాణ్యత, భద్రత మరింత మెరుగుపడుతుంది. ముడి పదార్థాల కొనుగోలు నుంచి ప్రసాదాల తయారీ, పంపిణీ వరకు కఠినమైన నాణ్యత

త ర మల లడ డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in