తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియం.. భూమి కేటాయించేందుకు టీటీడీ అంగీకారం
Actor ProfilePolitician

తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియం.. భూమి కేటాయించేందుకు టీటీడీ అంగీకారం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియం.. భూమి కేటాయించేందుకు టీటీడీ అంగీకారం
AP7AM3 Jul 2026
తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియం.. భూమి కేటాయించేందుకు టీటీడీ అంగీకారం

తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియం (National Museum of Epigraphy) ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ ప్రతిష్ఠాత్మక మ్యూజియం కోసం రెండు ఎకరాల భూమిని కేటాయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సూత్రప్రాయంగా అంగీకరించింది.ఇటీవల టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర, ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కార్యదర్శి వివేక్, భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) డైరెక్టర్ జనరల్ యదువీర్ సింగ్‌ల మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భారతదేశపు వేల సంవత్సరాల శాసన వారసత్వాన్ని పరిరక్షించేందుకు, పరిశోధనలకు ఒక ప్రధాన కేంద్రంగా ఈ మ్యూజియంను తీర్చిదిద్దనున్నట్లు ఏఎస్ఐ డైరెక్టర్ (ఎపిగ్రఫీ) కె. మునిరత్నం రెడ్డి తెలిపారు.ఈ మ్యూజియంలో అరుదైన శిలా, రాగి ఫలక శాసనాలతో పాటు, పురాతన భారత చరిత్రను వివరించే ఫోటో మ్యూరల్స్, ఇంటరాక్టివ్ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. బ్రాహ్మి, ఖరోష్ఠి వంటి ప్రాచీన లిపులతో పాటు, శారద, టంక్రి, గుప్త, శంఖలిపి వంటి ప్రాంతీయ లిపులను ప్రదర్శించనున్నారు. క్రీస్తుపూర్వం 2500 నుంచి 17వ శతాబ్దం వరకు గల అసలైన శాసనాలను ఇక్కడ పొందుపరుస్తారు. వీటి ద్వారా రాజవంశాల చరిత్ర, పరిపాలనా విధానాలు, సామాజిక-ఆర్థిక పరిస్థితులను విద్యార్థులు, పరిశోధకులు అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుంది.ఈ మ్యూజియం ఏర్పాటు ద్వారా తిరుమల యాత్రికులను సాంస్కృతిక, చారిత్రక అంశాలతో ఆకట్టుకోవచ్చని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అభిప్రాయపడ్డారు

త ర పత ల జ త య శ సన ల మ య జ య భ మ క ట య చ ద క ట ట డ అ గ క ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in