
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam 2026) పథకం అమలుపై సరికొత్త కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇవాళ విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ పథకం పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థికి ఈ స్కీమ్ కింద ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఏ ఒక్క విద్యార్థి కూడా సాంకేతిక కారణాల వల్ల నష్టపోకూడదని, అర్హులైన ప్రతి తల్లి ఖాతాలోకి నిధులు చేరేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. నిరుపేద కుటుంబాల్లోని పిల్లల చదువులకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఊతాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. Read Also : తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్ కు ఐదేళ్ల జైలు శిక్ష ఈ సమీక్షా సమావేశంలో భాగంగా విద్యాశాఖ అధికారులు పథకం గ్రౌండ్ లెవెల్ ఏర్పాట్లను మంత్రి లోకేశ్కు క్షుణ్ణంగా వివరించారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రస్తుతం అత్యంత కీలకమైన తల్లుల ఆధార్ వెరిఫికేషన్ (Aadhaar Verification) ప్రక్రియ శరవేగంగా జరుగుతోందని, చాలా త్వరలోనే ఈ ప్రక్రియను వంద శాతం పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. జులై మూడో వారంలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ ‘తల్లికి వందనం’ పథకాన్ని అధికారికంగా ప్రారంభించి, అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ (DBT) చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు మంత్రికి నివేదించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగంలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పుల్లో భాగంగా ఈ పథకం అమలు కానుండటంతో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. Environment : పర్యావరణం నాశనం కావడానికి మగాళ్లే కారణం – బాలీవుడ్
