
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలన ప్రారంభించడానికి ముందే సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ విషయంలో ట్రంప్ వైఖరి తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇరాన్పై పూర్తి స్థాయి యుద్ధానికి సంబంధించిన ఆప్షన్లపై ట్రంప్ ఇప్పటికే తన కీలక అధికారులతో బ్రీఫింగ్ తీసుకున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ (డబ్ల్యూఎస్జే) సంచలన రిపోర్టు ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం, ట్రంప్ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్లతో వరుసగా సమావేశమవుతూ ఇరాన్పై సైనిక చర్య తీసుకునే అవకాశాలను లోతుగా సమీక్షించారు. దీంతో, రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు మరింత ముదరనున్నాయనే సంకేతాలు వెలువడ్డాయి. ట్రంప్ మొదటి విడత పాలనలో కూడా ఇరాన్తో సంబంధాలు తీవ్ర ఉద్రిక్తంగా సాగాయి. ఇప్పుడు రెండో విడతలో బాధ్యతలు చేపట్టక ముందే యుద్ధ సమీక్షలు నిర్వహించడం అంటే.. ట్రంప్ దూకుడుగా ముందుకు వెళ్ళేందుకే సిద్ధంగా ఉన్నారని స్పష్టమవుతోంది. "జాబ్ను ఫినిష్ చేయడం" అనే ఆలోచనతో ట్రంప్ ఉన్నట్లు డబ్ల్యూఎస్జే రిపోర్ట్ పేర్కొంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం అమెరికా మొదటి ప్రాధాన్యత దౌత్య పరమైన చొరవలు, చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవడం అని కొందరు చెప్తున్నారు. కానీ, ట్రంప్ మాత్రం సైనిక చర్య ఆప్షన్ను పూర్తిగా తోసిపుచ్చలేదు. చర్చలు విఫలమైతే, యుద్ధానికి సిద్ధంగా ఉండాలనేది ట్రంప్ స్టాండ్. మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెెంజమిన్ నెతన్యాహు కూడా ఇదే విధమైన కఠినమైన వ్యాఖ్యలు చేశారు. "అవసరమైతే ఇరాన్లోకి మూడోసారి అయినా వస్తాం.. కానీ, వారికి అణు ఆయుధాలు ఉండనివ్వం" అని నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ఇరాన్పై ఒక ప్రణాళికతో ముందుకు వెళుతున్నాయనే భావన ఈ వ్యాఖ్యల వల్ల బలపడుతోంది. అటు ట్రంప్ బ్రీఫింగ్లు, ఇటు నెతన్యాహు హెచ్చరికలతో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరే