
ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్లలో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ కాయాదు లోహర్ (Kayadu Lohar). డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఈ భామ నటించిన తాజా చిత్రం ఇదయం మురళి. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్లలో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ కాయాదు లోహర్ (Kayadu Lohar). డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఈ భామ నటించిన తాజా చిత్రం ఇదయం మురళి. అధర్వ మురళి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, కాయాదు లోహర్ హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ హాట్ బ్యూటీస్ ఇద్దరూ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రీతి ఈ మధ్యనే బ్లాస్ట్ మూవీతో సక్సెస్ అందుకుంది. అందులో ఆమె తనతో అసభ్యంగా బిహేవ్ చేసిన కోలీగ్స్ ని చితక్కోడుతుంది. ఆలానే రియల్ లైఫ్ మీ బ్లాస్ట్ మూమెంట్ ఏంటి అని యాంకర్ ఈ ఇద్దరు బ్యూటీలను ఆడగగా.. కాయాదు లోహర్ తన పాఠశాల రోజుల్లో జరిగిన ఒక చేదు అనుభవాన్ని పంచుకుని అందరినీ షాక్కు గురిచేసింది. 'స్కూల్ రోజుల్లో ఒక అబ్బాయి నన్ను నిరంతరం ఫాలో అవుతూ వేధించేవాడు. మొదట్లో నేను చాలా ఓపికగా వ్యవహరించాను. ఆ వయసులో గొడవలు ఎందుకని భావించి, సదరు అబ్బాయి చేసిన తప్పును రెండు సార్లు క్షమించి వదిలేశాను, కానీ, ఆ అబ్బాయి మాత్రం మారకుండా మూడోసారి కూడా హద్దులు దాటి ప్రవర్తించడంతో నాకు ఎంతో కోపం వచ్చింది. ఆ విపరీతమైన కోపంతో అక్కడే ఉన్న ఒక పెద్ద రాయిని తీసి అతనిపైకి బలంగా విసిరాను. ఆ రాయి తగలడంతో అబ్బాయి తల పగిలి రక్తం వచ్చింది. ఆ తర్వాత అతను ఎప్పుడూ నా జోలికి రాలేదని' ఆమె గుర్తుచేసుకుంది. అంతేకాకుండా తానేదో