
ప్రైవేట్, కార్పొరేట్ ఉద్యోగుల భవిష్యత్తు నిధి (PF)కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు ఆరు దశాబ్దాల కాలం నాటి పాత ఈపీఎఫ్ స్కీమ్ 1952 స్థానంలో.. సరికొత్త సామాజిక భద్రతా కోడ్ (Social Security Code) కింద ఈపీఎఫ్ స్కీమ్ 2026ను అధికారికంగా నోటిఫై చేసింది. జూన్ 29, 2026 నుంచి ఈ కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా గెజెట్ ప్రచురణతో అమల్లోకి వచ్చాయి. అయితే, ఈ కొత్త స్కీమ్ వల్ల మీ పీఎఫ్ డబ్బులు కట్ అవ్వడంలో గానీ, వచ్చే వడ్డీలో గానీ ఏవైనా మార్పులు ఉంటాయా? అసలు ఉద్యోగులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.జీతం నుంచి కట్ అయ్యే పీఎఫ్ మారదు!కొత్త రూల్స్ వచ్చాయి కదా అని మీ జీతం నుంచి కట్ అయ్యే పీఎఫ్ అమౌంట్ ఏమీ మారదు.ఎప్పటిలాగే ఉద్యోగి బేసిక్ శాలరీ నుంచి 12 శాతం, కంపెనీ తరపున మరో 12 శాతం పీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. కొన్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలకు మాత్రం ఇది 10 శాతంగానే కొనసాగుతుంది.కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట వేతన పరిమితి (Wage Ceiling) ప్రకారమే ఈ కటింగ్లు ఉంటాయి.ఒకవేళ ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో ఎక్కువ డబ్బులు దాచుకోవాలనుకుంటే.. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF) ద్వారా అదనంగా పొదుపు చేసుకునే వెసులుబాటును అలాగే ఉంచారు.ఏడాదికి రెండు సార్లే పీఎఫ్ విత్డ్రా!గతంలో అనారోగ్య కారణాల (Medical Emergency) పేరిట పీఎఫ్ ఖాతా నుంచి ఎన్నిసార్లయినా డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై ఒక ఏడాదిలో గరిష్ఠంగా రెండు సార్లు మాత్రమే పాక్షికంగా డబ్బులు తీసుకోవడానికి అనుమతిస్తారు.ఉదాహరణకు, మీరు ఒక సంవత్సరంలో వేరే ఏదైనా అవసరానికి పీఎఫ్ నుంచి కొంత డబ్బు తీసుకుంటే.. అదే ఏడాదిలో అనారోగ్యం కింద డబ్బులు తీసుకోవడానికి ఇంకా ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది.చదువు, పెళ్లి కోసం