చాలా మంది శ్వాస ఆడకే చనిపోయారు
Actor ProfilePolitician

చాలా మంది శ్వాస ఆడకే చనిపోయారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చాలా మంది శ్వాస ఆడకే చనిపోయారు
Oneindia Telugu3 Jul 2026
చాలా మంది శ్వాస ఆడకే చనిపోయారు

యూపీ రాజధాని లక్నోలోని ఓ కోచింగ్ సెంటర్‌లో సోమవారం జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మరణాలకు గల కారణాలపై కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ(కేజీఎంయూ) మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రేమ్ రాజ్ సింగ్ ఓ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఆస్పత్రికి తీసుకొచ్చిన వారిలో అత్యధిక మరణాలు కేవలం పొగ వల్ల ఊపిరాడకపోవడం వల్లే జరిగాయని ఆయన ప్రాథమికంగా ధ్రువీకరించారు. నిప్పుల కంటే దట్టమైన పొగ కమ్మేయడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారి యువత ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు.Viral Video: టీ కొట్టు లొల్లి.. ఐపీఎస్ అని బిల్డప్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయాడు! ఈ దారుణ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 15 మంది మృతదేహాలను ఆస్పత్రికి తీసుకువచ్చారని.. వారంతా ఇక్కడికి తీసుకురాకముందే మరణించారని డాక్టర్ ప్రేమ్ రాజ్ సింగ్ వెల్లడించారు. ఈ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదంలో మరో 7 నుంచి 8 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ఓ యువకుడి వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో అతడిని ఐసీయూలో ఉంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అలాగే ఓ యువతి కాలు విరగడంతో ఆమెకు ఎక్స్-రే తీయించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి గాయపడిన వారి పరిస్థితి స్థిరంగానే ఉందని వైద్యుల బృందం వెల్లడించింది.ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారంతా 25 నుంచి 27 ఏళ్ల లోపు వయసున్న యువతీ యువకులే కావడం గమనార్హం. కోచింగ్ సెంటర్లో భవిష్యత్తు కోసం చదువుకుంటున్న విద్యార్థులు ఇలా విగతజీవులుగా మారడంతో ఆస్పత్రి బయట వారి తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని ప్రకటించారు.NEET రీఎగ్జామ్.. ఒత్తిడి తట్టుకోలేక

చ ల మ ద శ వ స ఆడక చన ప య ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in