
గ్యాస్ వినియోగదారులారా జాగ్రత్త.. జూలై 1కి ముందే ఇది పూర్తి చేయండి! LPG సబ్సిడీపై కీలక అప్డేట్.. వెంటనే e-KYC చెక్ చేసుకోండి! జూలై 1 నుంచి గ్యాస్ సబ్సిడీ రాదా? అసలు నిజం ఇదే! LPG e-KYC : గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జూన్ 30లోగా కేవైసీ చేయించుకోవాలంటూ మెసేజ్ వచ్చిందా? ప్రస్తుతం వాట్సాప్ ఫ్యామిలీ గ్రూపులు, సోషల్ మీడియాలో ఇదే మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. జూన్ 30, 2026లోపు ఎల్పీజీ eKYC పూర్తి చేయకపోతే జూలై 1 నుంచి గ్యాస్ సబ్సిడీ నిలిచిపోతందంటూ అందులో ఉంది. వాస్తవానికి, ఈ మెసేజ్లో కొంత నిజమే ఉంది. కానీ పూర్తిగా కాదు.. ఈ మెసేజ్ చూసినవారంతా సబ్సిడీ కోల్పోతామని భయపడుతున్నారు. అసలు నిజం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ మెసేజ్ నిజమా? ఫేక్? పూర్తిగా ఫేక్ కాదు... అలా అనీ పూర్తిగా నిజం కూడా కాదు.. ఎందుకంటే.. ఎల్పీజీ కంపెనీలు eKYC పూర్తి చేయాలని సూచిస్తున్నాయి. అయితే, ప్రతి ఒక్కరి గ్యాస్ సబ్సిడీ ఆగిపోతుందని వైరల్ అవుతున్న ప్రచారంలో మాత్రం నిజం లేదు. ప్రస్తుతం ఎల్పీజీ సబ్సిడీ పొందుతున్నారో వారిపైనే ప్రభావం ఉంటుంది అంతే.. మూడు ప్రభుత్వ ఎల్పీజీ కంపెనీలైన ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ వినియోగదారులను eKYC పూర్తి చేయాల్సిందిగా సూచిస్తున్నాయి. జూన్ 30 నాటికి eKYC పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా eKYC పెండింగ్లో ఉంటే డీబీటీ ద్వారా వచ్చే ఎల్పీజీ సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అందరికీ సబ్సిడీ ఆగిపోతుందా? : లేదు. ఇదే చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. గత కొన్ని ఏళ్లుగా సాధారణ ఎల్పీజీ వినియోగదారులకు ప్రభుత్వ సబ్సిడీ చాలా తక్కువగా ఉంది. అలాగే, మీరు మార్కెట్ ధరకే సిలిండర్ కొంటున్నారు కదా.. మీ బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ పేరుతో పెద్ద మొత్తంలో డబ్బు జమ కావడం