
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. India Vs England T20I Series: ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు ముందు టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. ఇటీవల జరిగిన ఐర్లాండ్ సిరీస్లో భారత జట్టు ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే అందులో భారత బ్యాటర్ల వైఫల్యం పెద్ద కారణమని విమర్శలు వస్తున్న నేపథ్యంలో మేనేజ్మెంట్ జట్టులో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. నేటి నుంచి అనగా జూలై 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ (5 మ్యాచ్లు)లో భారత కోచ్ సరికొత్త ప్లాన్తో రాబోతున్నారని తెలుస్తోంది. ఓటమి తర్వాత ఒత్తిడిలో టీమిండియా.. భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ తో సిరీస్ లో భాగంగా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ తర్వాత జులై 14 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ పర్యటనకు ముందు ఐర్లాండ్ చేతిలో టీమిండియా 2-0 తేడాతో క్లీన్స్వీప్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. సులువుగా గెలుస్తామనుకున్న మ్యాచ్ల్లో భారత బ్యాటర్ల నిర్లక్ష్యం కారణంగా సిరీస్ కోల్పోవడంతో పాటు భారత ఓపెనర్లు పేలవ ప్రదర్శనతో రాణించలేకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. దీంతో ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో బలమైన ఓపెనర్లను ప్లేయింగ్ లెవెల్ లోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తుంది. ఐలాండ్తో జరిగిన సిరీస్లో ఓపెనింగ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, సంజు సాంసంగ్ ఆశించిన స్థాయిలో