గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం... ఇందిరమ్మ ఇళ్ల
Actor ProfilePolitician

గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం... ఇందిరమ్మ ఇళ్ల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం... ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
TeluguOne17 Jun 2026
గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం... ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రాన్ని గుడిసెలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా నివసిస్తున్న గుడిసెల వివరాలను సేకరించేందుకు తక్షణమే ఒక సమగ్ర సర్వేను ప్రారంభించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ, మార్గదర్శకాలపై మంత్రి పొంగులేటి సచివాలయం నుంచి అధికారులతో ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 75 వేల మంది తాము గుడిసెల్లో జీవిస్తున్నామంటూ దరఖాస్తు చేసుకున్నారని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పరిశీలించి, అసలైన అర్హుల జాబితాను త్వరితగతిన సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. గతంలో వివిధ కారణాల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయిన నిరుపేదలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని మంత్రి తెలిపారు. అర్హులైన వారు ఇప్పటికైనా స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయాల్లో తమ వివరాలతో దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో కులాలకు, మతాలకు లేదా రాజకీయ పార్టీలకు ఎలాంటి ప్రాధాన్యత ఉండకూడదని, కేవలం అర్హతనే ప్రామాణికంగా తీసుకోవాలని కలెక్టర్లు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2,000 ఇళ్ల చొప్పున మొత్తం 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని పొంగులేటి వివరించారు. ఈ ప్రక్రియలో గుడిసెల్లో నివసించే అత్యంత నిరుపేదలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవినీతికి తావులేకుండా అత్యంత పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీనితో పాటు పేద ప్రజల నివాస భద్రతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం 'రూఫ్ రీప్లేస్‌మెంట్' (పైకప్పుల మార్పిడి) అనే వినూత్న పథకాన్ని తీసుకొచ్చిందని మంత్రి వెల్లడించారు. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా తొలిదశలో 50 వేల ఇళ్లను