
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Pune businessman ketan agarwal death case: ఇటీవల కొంత మంది భార్యభర్తలు ఒకర్ని మరోకరు చంపుకొవడమే పనిగా పెట్టుకున్నట్లు ఉన్నారు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఒకరిపై మరోకరు కారాలు, మిరియాలు నూరుకుంటున్నారు. వీరి సంగతి ఇలా ఉందంటే.. మరికొంత మంది పెళ్లి నిశ్చయం చేసుకుని మరీ పెళ్లికి ముందే కాబోయే పార్ట్ నర్ లకు స్పాట్ లు పెట్టుకుంటున్నారు.. వీరిని చూస్తుంటే అసలు పెళ్లంటేనే చాలా మంది భయంతో కిలోమీటర్ దూరం పారిపోతున్నారు. ఈ క్రమంలో ఇటీవల మహారాష్ట్రలోని పూణెలో కాబోయే భార్య పుట్టిన రోజు అని ఆమెతో కలసి ఎత్తైన ప్రదేశంకు వెళ్లిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కాలు జారీ లోయలోకి పడిపోయాడు. తొలుత ఇదే నిజమని అందరు భావించారు. కానీ ఈ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహారాష్ట్రలోని పూణేకు చెందిన యువ వ్యాపార వేత్త 26 ఏళ్ల కేతన్ విశాల్ అగర్వాల్ కు ఇటీవల ఒక యువతితో పెళ్లి నిశ్చయం అయ్యింది. ఇరుకుటుంబాలు ఈ ఏడాది వీరి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కాబోయే భార్య పుట్టిన రోజు కావడంతో ఆమెను సర్ ప్రైజ్ చేయాలని కేతన్ విశాల్ యువతిని, ఆమె ఫ్రెండ్ ను ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లోనవాలా సమీపంలోని లోహగడ్ కోటకు ట్రెక్కింగ్ కు తీసుకెళ్లాడు. అక్కడ ఫోటో షూట్ చేస్తున్నారు. ఇంతలో కేతన్ విశాల్ అగర్వాల్ 400 అడుగుల లోతైన లోయలో కాలు జారీ పడిపోయాడని యువతి, ఆమె ఫ్రెండ్ చెప్పారు. ఈ క్రమంలో తొలుత అందరు ఇదే నిజమని