
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తమ నూతన సారథిని ఖరారు చేస్తూ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. భారత దేశ 25వ ప్రధాన ఎన్నికల అధికారి (CEC)గా, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ను బ్యాంక్ కొత్త ఛైర్మన్గా నియమించింది. ఆయనను నాలుగేళ్ల కాలపరిమితికి గాను స్వతంత్ర డైరెక్టర్గా నియమిస్తూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డు ఆమోదముద్ర వేసింది. 2026 జూన్ 30 నుంచే ఈ నియామకం అమల్లోకి వస్తుందని స్టాక్ ఎక్స్ఛేంజీల ఫైలింగ్లో బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. ఈ నియామకానికి మరియు పారితోషికానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తుది ఆమోదం లభించిన వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.నైతిక విలువల వివాదం తర్వాత కీలక భర్తీ!హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఈ నియామకం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. గత మార్చి నెలలో బ్యాంకులో నైతిక విలువలపై (Ethical Concerns) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అప్పటి ఛైర్మన్ అతాను చక్రవర్తి అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. ఆ సంచలన రాజీనామాతో ఖాళీ అయిన అత్యున్నత స్థానాన్ని భర్తీ చేయడానికి, వ్యవస్థలపై పూర్తి పట్టున్న రాజీవ్ కుమార్ను బోర్డు ఎంపిక చేయడం విశేషం. ప్రపంచంలోనే అత్యధిక మంది ఓటర్లు పాల్గొన్న 2024 లోక్సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించిన ఘనత రాజీవ్ కుమార్కు ఉంది. అయితే, ఆయన పదవీకాలంలో ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.ఆర్థిక రంగ ప్రక్షాళనలో రాజీవ్ మార్క్ సంస్కరణలు!గతంలో కేంద్ర ఆర్థిక సేవల విభాగ కార్యదర్శి (2017-2020)గా రాజీవ్ కుమార్ దేశ ఆర్థిక రంగాన్ని పరుగులెత్తించడంలో కీలక పాత్ర పోషించారని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొనియాడింది.షెల్ కంపెనీలపై ఉక్కుపాదం: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు (NPA) రికార్డు స్థాయికి చేరిన క్లిష్ట సమయంలో బాధ్యతలు చేపట్టిన ఆయన.. కేవలం కొద్ది రోజుల్లోనే