
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్సైట్కు సంబంధించిన వీడియో కంటెంట్పై కూడా అవగాహన ఉంది.. Kondagattu Temple Controversy Latest News: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మరో వివాదం చెలరేగింది.. ప్రతిరోజు లక్షలాది రూపాయల ఆదాయం వచ్చే ఆలయ టికెట్ క్యాష్ కౌంటర్లు ఒక ప్రైవేటు వ్యక్తి తిష్ట వేసి నగదు లావాదేవీలు నిర్వహించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వ్యక్తిగత కారు డ్రైవర్.. ఏకంగా అంజన్న ఆలయ అధికారిక క్యాష్ కౌంటర్లో కూర్చొని భక్తులకు టికెట్లు ఇస్తూ.. డబ్బులు వసూలు చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై భక్తులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అధికారిక కౌంటర్లో ప్రైవేట్ వ్యక్తికి ఏం పని? స్వామి వారి దర్శనంతో పాటు పూజ, ప్రసాదాల కోసం ప్రతిరోజు వేలాదిమంది భక్తులు కొండగట్టుకు తరలివస్తు ఉంటారు. దీని ద్వారా ఆలయ కౌంటర్లకు భారీగా నగదు అందుతుంది.. అత్యంత పారదర్శకంగా.. కేవలం ప్రభుత్వం లేదా దేవస్థాన అధికారిక సిబ్బంది మాత్రమే నిర్వహించాల్సిన ఈ బాధ్యతయుతమైన సీట్ లో.. ఈవో సొంత డ్రైవర్ కూర్చోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దేవస్థాన నియమావళి ప్రకారం ఎలాంటి అర్హతలేని ఒక ప్రైవేటు వ్యక్తి. ప్రభుత్వం సొమ్ముతో కూడిన క్యాష్ కౌంటర్ లో ఎలా కూర్చుంటాడని.. దీనికి ఈవో పరోక్షంగా అనుమతి ఇచ్చారా? అని భక్తులతో పాటు కొంతమంది ఆలయ అధికారులు ప్రశ్నిస్తున్నారు.. క్రింది స్థాయి సిబ్బందిపై దురుసు ప్రవర్తన.. ఈవో అండా చూసుకొని.. సదర్ డ్రైవర్ ఆలయంలో ఇష్టారాజ్యంగా