
కుంకుమ భాగ్య ఫేమ్ టీవీ నటి సంచిత ఉగలే ఆత్మహత్య చేసుకున్నారు. కేవలం ముప్పై ఏళ్ల వయసులోనే ఆమె మరణించడం టెలివిజన్ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ముంబై నలసోపారలోని తన నివాసంలో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆమె ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కెరీర్ లో ఎంతో భవిష్యత్తు ఉన్న నటి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అందరినీ కలచివేసింది. ఈ వార్త తెలియగానే సహచర నటీనటులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. Read also: Happy Movie Re Release: కేరళలో హ్యాపీ రీ-రిలీజ్.. కొత్త సినిమా రేంజ్లో రికార్డు కలెక్షన్లు టెలివిజన్ రంగంలో సంచిత ఉగలే తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. కుంకుమ భాగ్య, వాగ్లే కి దునియా వంటి పాపులర్ సీరియల్స్ లో ఆమె నటించి ప్రేక్షకులను అలరించారు. నటనపై ఎంతో ఆసక్తి ఉన్న ఆమె, వెండితెరపై కూడా సత్తా చాటారు. విక్కీ కౌశల్ నటించిన ఛావా చిత్రంలో ఆమె పోషించిన తారాబాయి పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రంలో సుకూన్ అనే పాత్ర ద్వారా ఆమె వెండితెర అరంగేట్రం చేశారు. ఇలా బుల్లితెర నుంచి వెండితెర వరకు తన ప్రతిభతో రాణించిన ఆమె ఆకస్మిక మరణం అందరిని షాక్ కి గురి చేసింది. చనిపోవడానికి ముందు ఆమె సోషల్ మీడియాలో ఎంతో ఉత్సాహంగా కనిపిస్తూ రీల్స్ చేశారు. ఒకవైపు నటిగా రాణిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. గతంలో మిషా అగర్వాల్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు సంచిత స్పందించిన తీరు అందరిని ఆకట్టుకుంది. యువత తమ జీవితాల గురించి తేలికగా