
ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదమే తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది... స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 104వ జయంతి వేడుకలు హైదరాబాద్లోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగువన్ ఎండీ కంఠమనేని రవిశంకర్, దశరథ్ జనార్ధన్కు ఎన్టీఆర్ పురస్కారాన్ని ప్రదానం చేస్తూ ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదం తెలుగు సమాజంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను గుర్తు చేశారు. తన చిన్ననాటి అనుభవాలను పంచుకున్న రవిశంకర్, 1983కు ముందు ఉత్తర భారతదేశంలోని నగరాల్లో, ముఖ్యంగా ఢిల్లీలో, తెలుగు వారిని ప్రత్యేక గుర్తింపుతో చూడకుండా దక్షిణాది ప్రజలందరినీ కలిపి "మద్రాసీలు" అని పిలిచేవారని పేర్కొన్నారు. అయితే 1983లో ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసి, తెలుగు ఆత్మగౌరవ నినాదాన్ని ముందుకు తీసుకురావడంతో దేశవ్యాప్తంగా తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. అప్పటి నుంచి తెలుగువారు తమ భాష, సంస్కృతి, అస్తిత్వంపై గర్వపడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఎన్టీఆర్ అందించిన అదే స్ఫూర్తితో డిజిటల్ మీడియా విస్తృతంగా అభివృద్ధి చెందకముందే 'తెలుగువన్' సంస్థను స్థాపించినట్లు రవిశంకర్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలనే సంకల్పంతో, తెలుగువాడు ఎల్లప్పుడూ "ఒకటో స్థానం"లో ఉండాలనే లక్ష్యంతో 'తెలుగువన్' అనే పేరును ఎంపిక చేసినట్లు వివరించారు. భాష, సంస్కృతి, ప్రాంతీయ అస్తిత్వాన్ని డిజిటల్ మరియు వెబ్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడం కూడా ఒక శక్తివంతమైన సామాజిక ఉద్యమంగా మారిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పురస్కార గ్రహీత దశరథ్ జనార్ధన్ సేవలను రవిశంకర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎన్టీఆర్ మరణించి దాదాపు మూడు దశాబ్దాలు గడిచినా ఆయన ఆశయాలను సజీవంగా ఉంచేందుకు, శతజయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించేందుకు జనార్ధన్ విశేష కృషి చేశారని కొనియాడారు. రాజకీయాల్లో ఎంతోమంది నాయకులు లబ్ధి పొందిన తర్వాత తమకు అవకాశమిచ్చిన నాయకులను మరచిపోతారని, కానీ ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకుండా ఎన్టీఆర్ సిద్ధాంతాలను