ఊహించని పార్టీలోకి టీఎంసీ రెబెల్స్ విలీనం
Actor ProfilePolitician

ఊహించని పార్టీలోకి టీఎంసీ రెబెల్స్ విలీనం

Total News3
Movie Updates0
Sources1
టీఎంసీ రెబెల్స్ కు స్పీకర్ ట్విస్ట్..! మమతకు ఊరట
Oneindia Telugu16 Jun 2026
టీఎంసీ రెబెల్స్ కు స్పీకర్ ట్విస్ట్..! మమతకు ఊరట

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో చోటు చేసుకున్న తిరుగుబాటు వ్యవహారం ఇప్పుడు లోక్ సభ స్పీకర్ (Lok Sabha Speaker) కోర్టుకు చేరింది. ఇప్పటికే టీఎంసీకి ఉన్న 28

సోషల్ మీడియాలో తెలిసింది-టీఎంసీ రెబెల్స్ విలీనంపై ఆ పార్టీ బాస్
Oneindia Telugu15 Jun 2026
సోషల్ మీడియాలో తెలిసింది-టీఎంసీ రెబెల్స్ విలీనంపై ఆ పార్టీ బాస్

పశ్చిమబెంగాల్లో తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) నుంచి విడిపోయిన 20 మంది రెబెల్ ఎంపీలు వేరు కుంపటి పెట్టుకున్నారు. తాజాగా వీరు లోక్ సభ స్పీకర్

ఊహించని పార్టీలోకి టీఎంసీ రెబెల్స్ విలీనం- స్పీకర్ కు లేఖ
Oneindia Telugu14 Jun 2026
ఊహించని పార్టీలోకి టీఎంసీ రెబెల్స్ విలీనం- స్పీకర్ కు లేఖ

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్లమెంటరీ పార్టీలో మొదలైన తిరుగుబాటు పర్వం ఇవాళ కీలక మలుపు తీసుకుంది. సీనియర్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో పార్టీకి చెందిన 20 మంది రెబెల్ ఎంపీలు ఇవాళ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. లోక్ సభలో తమకు ప్రత్యేక సీటింగ్ కేటాయించాలని కోరారు. అలాగే తాము నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో (Nationalist Citizens Party) విలీనం కావాలని నిర్ణయించినట్లు కూడా ఆయనకు తెలిపారు. తాము ఎన్డీయేకు మద్దతిస్తామని తెలిపారు.ఢిల్లీకి తృణమూల్ పంచాయతీ..! అభిషేక్ వర్సెస్ రెబెల్స్..!తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది లోక్‌సభ ఎంపీలతో కూడిన తిరుగుబాటు వర్గం, త్రిపురకు చెందిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో విలీనం కావాలని నిర్ణయించింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తమ లేఖను సమర్పించిన అనంతరం ఈ విషయాన్ని తిరుగుబాటు వర్గ నాయకురాలు కకోలి ఘోష్ దస్తీదార్ ప్రకటించారు. తాము పార్లమెంటులో ప్రత్యేకంగా కూర్చుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేస్తామని తెలిపారు. తమకు మూడింట రెండు వంతుల మెజారిటీ ఉందని, తాము ఎన్డీయేలో భాగమై, ప్రధాని నాయకత్వంలో పనిచేస్తామన్నారు. టీఎంసీ విలీనంపై తేల్చేసిన కాంగ్రెస్..! కేసీ వేణుగోపాల్ క్లారిటీ..! ఈ పరిణామంతో లోక్ సభలో 28 మంది ఎంపీలు కలిగిన తృణమూల్ కాంగ్రెస్ లో సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. అలాగే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు దిగువ సభలో ప్రతిపక్షాల బలాన్ని గణనీయంగా తగ్గించింది. ప్రత్యేక వర్గంగా ఏర్పడేటప్పుడు అనివార్యంగా తలెత్తే చట్టపరమైన చిక్కులను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తిరుగుబాటు వర్గంలో చేరిన చివరి ఎంపీలలో ఒకరైన, పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన సుదీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ.. తాము నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో విలీనం అవుతామన్నారు. అది ఒక ప్రాంతీయ పార్టీ అన్నారు. ఇది ఒక విధానమని ఆయన పేర్కొన్నారు.