ఉద్ధవ్ తో ఫడ్నవీస్ విమాన ప్రయాణం.. ఏక్ నాథ్ షిండే ఏమ న్నారంటే
Actor ProfilePolitician

ఉద్ధవ్ తో ఫడ్నవీస్ విమాన ప్రయాణం.. ఏక్ నాథ్ షిండే ఏమ న్నారంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఉద్ధవ్ తో ఫడ్నవీస్ విమాన ప్రయాణం.. ఏక్ నాథ్ షిండే ఏమ న్నారంటే
AP7AM7 Aug 2026
ఉద్ధవ్ తో ఫడ్నవీస్ విమాన ప్రయాణం.. ఏక్ నాథ్ షిండే ఏమ న్నారంటే

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఒకే విమానంలో ప్రయాణించడంపై ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్రపూరిత స్నేహితుడు ఎంత ప్రమాదకరమో సీఎం ఫడ్నవీస్‌కు బాగా తెలుసని, ఆయన చాలా తెలివైన వారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించే చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.ముంబై నుంచి నాగ్‌పూర్‌కు వెళ్లే విమానంలో ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే కలిసి ప్రయాణించారు. ఈ ఘటనపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు షిండే పైవిధంగా స్పందించారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీ, అప్పటి శివసేన ఒకే విమానంలో ఉన్నాయని, కానీ అప్పుడు ఉద్ధవ్ వేరే విమానం ఎక్కి కాంగ్రెస్‌తో చేతులు కలిపారని ఆయన గుర్తుచేశారు. ఆనాటి రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ ఉద్ధవ్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.మరోవైపు ఫడ్నవీస్‌తో విమాన ప్రయాణం గురించి ఉద్ధవ్ ఠాక్రేను అడగ్గా.. తమ మధ్య 'అత్యున్నత స్థాయిలో చర్చలు' జరిగాయని ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. దాని ఫలితం రాబోయే రోజుల్లో తెలుస్తుందని చెప్పడంతో రాజకీయంగా చర్చ మరింత ఊపందుకుంది. అయితే, ఈ ప్రయాణానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, పార్టీలకు అతీతంగా నేతల మధ్య వ్యక్తిగత స్నేహ సంబంధాలు ఉంటాయని బీజేపీ వర్గాలు కొట్టిపారేశాయి.ఇదిలా ఉంటే.. తన వర్గం నుంచి ఆరుగురు ఎంపీలు గెలిచిన నియోజకవర్గాల్లో ఉద్ధవ్ ఠాక్రే పర్యటించడాన్ని కూడా షిండే ప్రస్తావించారు. ఉద్ధవ్‌ను ఇంటి నుంచి బయటకు రప్పించి, ప్రజల్లోకి వచ్చేలా చేసింది తానేనని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుతం

ఉద ధవ త ఫడ నవ స వ మ న ప రయ ణ ఏక న థ ష డ ఏమ న న ర ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in