ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు... భారత్ నుండి వెళ్లేది వీరే
Actor ProfilePolitician

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు... భారత్ నుండి వెళ్లేది వీరే

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు... భారత్ నుండి వెళ్లేది వీరే
TeluguOne30 Aug 2026
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు... భారత్ నుండి వెళ్లేది వీరే

ఇరాన్ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని కన్నుమూయడంతో ఆ దేశంలో ఒక చారిత్రాత్మక అధ్యాయం ముగిసింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఆ దేశ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. జూలై 4వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ అంత్యక్రియల వేడుకలు జూలై 9వ తేదీ వరకు సుదీర్ఘంగా కొనసాగనున్నాయి. వారం రోజుల పాటు సాగే ఈ అంతిమ సంస్కారాలకు ప్రపంచ దేశాల నుండి ప్రముఖులు, దౌత్యవేత్తలు మరియు కోట్ల సంఖ్యలో ప్రజలు తరలిరానున్నారు. ఇరాన్ ప్రభుత్వ అధికారిక అంచనాల ప్రకారం.. ఈ అంత్యక్రియల కార్యక్రమాలకు దాదాపు 1.5 కోట్ల నుండి 2 కోట్ల మంది వరకు జనం హాజరయ్యే అవకాశం ఉంది. ఇదే కనుక నిజమైతే ఇరాన్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ ప్రభుత్వ అంత్యక్రియలుగా రికార్డు సృష్టించనుంది. ఈ చారిత్రాత్మక అంతిమ యాత్రకు ఇరాన్ ప్రభుత్వం తన మిత్ర దేశాలకు ప్రత్యేక ఆహ్వానాలను పంపుతోంది. ఇందులో భాగంగానే భారతదేశానికి కూడా ఇరాన్ నుండి అధికారిక ఆహ్వానం అందింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని ఈ అంత్యక్రియలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే, ప్రస్తుతం ఉన్న అత్యంత బిజీ షెడ్యూల్స్ మరియు ముందస్తు కార్యక్రమాల కారణంగా ప్రధాని మోడీ ఈ అంత్యక్రియలకు వ్యక్తిగతంగా హాజరు కావడం లేదు. ప్రధాని మోడీ వెళ్లలేకపోతున్న నేపథ్యంలో, భారతదేశం తరఫున ఒక ఉన్నత స్థాయి అధికారిక ప్రతినిధి బృందాన్ని ఇరాన్ పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భారత ప్రతినిధి బృందానికి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా నాయకత్వం వహించనున్నారు. ఆయనతో పాటు బిహార్ గవర్నర్ సయ్యద్ అటా హస్నైన్ కూడా భారత ప్రభుత్వ అధికారిక ప్రతినిధిగా ఇరాన్ దేశానికి వెళ్లనున్నారు. విశేషం ఏమిటంటే.. ఇరాన్ ప్రభుత్వం కేవలం భారత ప్రభుత్వానికే కాకుండా, ఇక్కడి

జమ్మలమడుగులో ఉద్రిక్తత..వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
TeluguOne30 Aug 2026
జమ్మలమడుగులో ఉద్రిక్తత..వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

ఎంతోకాలంగా కడప జిల్లాతో పాటు రాయలసీమ ప్రజలు ఎదురుచూస్తున్న ఉక్కు పరిశ్రమకు ఈ నెల 3న శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మలమడుగు వైసీపీ కార్యాలయం నుంచి

ఇర న స ప ర ల డర ఖమ న అ త యక ర యల భ రత న డ వ ళ ల ద వ ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in