
హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే గుండా వెళ్లే వాణిజ్య నౌకలపై టోల్ లేదా ఎలాంటి రుసుములు వసూలు చేసేందుకు వీల్లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు. బహ్రెయిన్లో జరిగిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఒకవేళ అంతర్జాతీయ జలమార్గాలపై ఏదైనా ఒక దేశం ఇటువంటి పన్నులు విధిస్తే దాని ప్రభావం ప్రపంచంలోని ఇతర సముద్ర మార్గాలపై కూడా పడుతుందని మార్కో రూబియో ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థలో తీవ్ర గందరగోళానికి, అరాచకత్వానికి దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఇరాన్ నుండి సైన్యం వెనక్కి: ట్రంప్ మాస్టర్ ప్లాన్తో సెనేట్లో ఊహించని షాక్!గల్ఫ్ దేశాలకు భరోసా ఇచ్చేందుకే పర్యటన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన మూడు రోజుల గల్ఫ్ పర్యటనలో భాగంగా చివరి దశలో బహ్రెయిన్ చేరుకున్నారు. ఇటీవలే అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరాన్తో అమెరికా చేసుకోబోయే ఎలాంటి ఒప్పందమైనా గల్ఫ్ దేశాల భద్రతకు, ప్రయోజనాలకు భంగం కలిగించబోదని మిత్రదేశాలకు భరోసా ఇవ్వడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. బహ్రెయిన్ అధికారులతో, జీసీసీ ప్రతినిధులతో జరిగిన ఈ కీలక సమావేశంలో ప్రాంతీయ భద్రత, ఇరాన్తో చర్చలు, హోర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన నౌకాయానం, మధ్యప్రాచ్యంలో శాంతి, స్థిరత్వం వంటి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.జలమార్గాలు ఎవరి జాగీర్ కాదు! ఈ సమావేశాన్ని ఉద్దేశించి మార్కో రూబియో మాట్లాడుతూ.. అంతర్జాతీయ జలమార్గాలు ఏ ఒక్క దేశానికి చెందిన సొంత ఆస్తి కాదన్నారు. కేవలం తమ ప్రాంతానికి సమీపంలో ఉందనే నెపంతో అంతర్జాతీయ జలమార్గాల గుండా వెళ్లే నౌకలపై రుసుములు వసూలు చేయడానికి అనుమతిస్తే.. అదే పద్ధతిని ప్రపంచంలోని మిగిలిన కీలకమైన సముద్ర మార్గాల్లోనూ ఇతర దేశాలు అనుసరించడం ప్రారంభిస్తాయని ఆయన పేర్కొన్నారు. అటువంటి పరిస్థితి వస్తే