
బండ బూతులతో విరుచుకుపడ్డ చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని రూ.100 కోట్ల భూమి కబ్జా వ్యవహారం బయటకు రావడంతో అక్కసు చంద్రగిరి కాంగ్రెస్ ఇన్చార్జి లోకేష్రెడ్డితో ఫోన్ సంభాషణ బాధితులకు అండగా నిలిచిన రిటైర్డ్ జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే కుటుంబంపైనా బూతులు మీడియా ఎదుట బట్టబయలు చేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సాక్షి, టాస్క్ఫోర్స్ : వాడెవడో రిటైర్డ్ జడ్జి అంట.. వానెమ్మను.. ఆ లం.. కొడుకు నాపైన కేసు పెట్టిస్తున్నాడు.. వాడి సంగతి.. చెవిరెడ్డికి ఇంకా నరకం చూపిస్తాను.. దీని వెనుక ఉన్న వారందరికీ నరకం చూపిస్తా చూడు.. నా.. కొడుకు, వాడు లం..కొడుకు.. ఇంకా బాధలు పడి అనుభవించేలా చేస్తా చూడు.. వదిలేది లేదు.. దొంగ ఓట్లు కేసు ఓపెన్ చేయిస్తా నా..కొడుక్కి. పై మాటలు చూస్తే మీకేమనిపిస్తోంది.. ఎవడో తాగుబోతు మాట్లాడినట్లుందనుకుంటే తప్పులో కాలు వేసినట్టే. సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే నోటి నుంచి వచ్చిన మాటలివి. న్యాయమూర్తులంటే ఏమాత్రం గౌరవం లేకుండా.. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని నోటి నుంచి వెలువడిన మాటలివి. శ్రీవారి పాదాల చెంత.. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో వినిపించిన దుర్భాష ఇది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే నోటి నుంచి వెలువడిన ఈ భాషను సభ్య సమాజం ఈసడించుకుంటోంది. భూ కబ్జాను అడ్డుకున్న రిటైర్డ్ జడ్జిని, బాధితులకు అండగా నిలిచిన చెవిరెడ్డి కుటుంబాన్ని పత్రికల్లో రాయలేనంత ఘోర పదజాలంతో దూషించడం కలకలం రేపుతోంది. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఐరాల లోకేష్రెడ్డి మధ్య జరిగిన ఆ ఫోన్ సంభాషణ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ ఆడియోను చంద్రగిరి వైఎస్సార్సీపీ ఇన్చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మంగళవారం తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో మీడియా సాక్షిగా బట్టబయలు చేశారు. ఆ