
ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశ రక్షణ కోసం అత్యున్నత త్యాగం చేసిన ఆరుగురు సైనికుల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశ రక్షణ కోసం అత్యున్నత త్యాగం చేసిన ఆరుగురు సైనికుల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్పై చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో మనదేశం కొందరు వీర జవాన్లను కోల్పోయింది (Operation Sindoor martyrs). ఆపరేషన్ సిందూర్ సమయంలో ఐదుగురు ఆర్మీ అధికారులతో పాటు ఓ అగ్నివీర్ వీరమరణం పొందారు. వారి పేర్లను నేషనల్ వార్ మెమోరియల్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. ప్రాణాలు కోల్పోయిన వీరుల పేర్లను న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకంలో ప్రత్యేక గ్రానైట్ శిలలపై చెక్కనున్నారు. వీరిలో ఇద్దరికి ఇప్పటికే అత్యున్నత శౌర్య పురస్కారాలు కూడా లభించాయి (National War Memorial). ఈ ఆరుగురు అమరవీరుల్లో రైఫిల్మన్ సునీల్ కుమార్కు మరణానంతరం 'వీర్ చక్ర' పురస్కారం లభించింది (Indian Army). అలాగే భారత వైమానిక దళానికి చెందిన సార్జెంట్ సురేంద్ర కుమార్కు 'వాయు పతకం' ప్రదానం చేశారు. ఇక, వీర మరణం పొందిన వారిలో తెలుగు వ్యక్తి అయిన మురళీ నాయక్ కూడా ఉన్నారు. ఆయన జమ్ము,కశ్మీర్లోని సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తూ పాక్తో జరిగిన ఎదురు కాల్పుల్లో అమరుడయ్యారు. సుబేదార్ మేజర్ పవన్ కుమార్ – ప్రధాన కార్యాలయం, 10 ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ రైఫిల్మన్ సునీల్ కుమార్ – 4వ బెటాలియన్, జమ్మూ,కశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ లాన్స్ నాయక్ దినేష్ కుమార్ – 5 ఫీల్డ్ రెజిమెంట్ అగ్నివీర్ మురళీ నాయక్ – 851 లైట్ రెజిమెంట్ హవీల్దార్ సునీల్ కుమార్ సింగ్ – 237 ఫీల్డ్ వర్క్షాప్ సార్జెంట్ సురేంద్ర కుమార్ – భారత వైమానిక దళం 39 వింగ్ మద్యం మత్తులో పెళ్లికి వచ్చిన వరుడు.. వధువు ఏం చేసిందంటే.. స్థిరంగా బంగారం ధరలు.. ఈ