
సాక్షి, హైదరాబాద్: ‘ఫ్రీ ఫైర్’.. ‘ఫ్రీ ఫైర్ మ్యాక్స్’ వంటి ఆన్లైన్ ఆటల ఉచ్చులో పడి చిన్నారులు చితికిపోతున్నారు. వారితో పాటు కుటుంబీకులూ ఆర్థికంగా, మానసికంగా నష్టపోతున్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వస్తున్న కొన్ని ఫిర్యాదులు పైకి కేవలం ఆర్థిక మోసాలుగా కనిపిస్తున్నప్పటికీ.. వెనుక ఈ వ్యసనం ఉంటోంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడమే దీనికి ప్రధాన కారణమని నగర కొత్వాల్ వీసీ సజ్జనర్ పేర్కొన్నారు. హ్యాకింగ్ కాదు ‘సన్’ స్ట్రోక్... తన మొబైల్కు వరుసగా నగదు డెబిట్ మెసేజ్లు రావడంతో కొందరు బాధితులు ఇటీవల సైబర్ క్రైమ్ ఠాణాకు క్యూ కట్టారు. తమ బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందంటూ ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల దర్యాప్తు నేపథ్యంలో వెలుగులోకి వచి్చన నిజాలు తల్లిదండ్రులను షాక్కు గురిచేశాయి. అక్కడ ఎలాంటి హ్యాకింగ్ జరగలేదని, వారి పిల్లలు ఆన్లైన్ గేమింగ్లో వర్చువల్ కాయిన్స్, డైమండ్స్ కొనుగోలు చేయడానికి తల్లిదండ్రుల డెబిట్ కార్డు వివరాలు వాడారని తేలింది. ప్రధానంగా తాతయ్యలు, నానమ్మల ఫోన్లలో యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయి ఉండటంతో పిల్లలు సులభంగా రూ. వేల లావాదేవీలు చేసేశారు. గేమ్ పరిచయంతో అక్కడకు పయనమై... ‘ఫ్రీ ఫైర్’ గేమ్ ద్వారా కొందరు అపరిచిత వ్యక్తులతో పరిచయం పెంచుకున్న బాలికలు ఆపై సోషల్ మీడియా యాప్స్ ద్వారా వారితో చాటింగ్ కొనసాగించారు. అలా ఆన్లైన్ మాయలో పడిపోయి, కేవలం ఇంటర్నెట్లో మాత్రమే పరిచయమైన ఆ వ్యక్తులను నేరుగా కలవడానికి తమ ఇళ్లను వదిలారు. పక్క రాష్ట్రానికి వెళ్లేందుకు పయనం కాగా... ఫిర్యాదు అందుకున్న పోలీసులు సకాలంలో స్పందించి ఆ బాలికలను సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఇలా రికార్డుల్లోకి ఎక్కకుండా కుటుంబాల మధ్యే ఉండిపోతున్న ‘గేమింగ్ ఉదంతాలు’ ఎన్నో ఉంటున్నాయి. అదో స్టేటస్ సింబల్గా మారడంతో... ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 10 నుంచి 17 ఏళ్ల విద్యార్థులు క్లాస్రూమ్స్ కంటే ఫ్రీ ఫైర్, మ్యాక్స్ వంటి