
Rules Changes: జూన్ నెల ముగియబోతోంది. జూలై నెల రాబోతోంది. వచ్చే నెలలో పలు విషయాలలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రతి నెలా కొన్ని మార్పులతోనే మొదలవుతుంది. జూలై 1వ తేదీ నుండి ఆధార్, పాస్పోర్ట్లు, వాహనాల ధరలు, చివరికి ఎల్పిజి ధరల వరకు అన్నింటిలోనూ పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఇవన్నీ మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రకటించిన ప్రకారం.. జూలై 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు మీ ఆధార్ కార్డులో ఈమెయిల్ చిరునామాను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఆధార్లో ఈమెయిల్ చిరునామాను అప్డేట్ చేయడానికి రూ.75 రుసుము చెల్లించాల్సి ఉండేది. ప్రజలు తమ ఆధార్ వివరాలను తాజా సమాచారంతో అప్డేట్ చేసుకునేలా ప్రోత్సహించడానికి ఆధార్ పాలక సంస్థ అయిన UIDAI ఈ చొరవ తీసుకుంటోంది. పాస్పోర్ట్ ఫీజులు పెరగనున్నాయి: ప్రభుత్వం పాస్పోర్ట్ ఫీజును పెంచింది. సాధారణ పాస్పోర్ట్ ఫీజు గతంలో ఉన్న రూ.1,500 నుండి ఇప్పుడు రూ.2,500కు పెరిగింది. అత్యవసర పాస్పోర్ట్ ఫీజు గతంలో ఉన్న రూ.3,500 నుండి ఇప్పుడు రూ.5,000కు పెరిగింది. ఈ కొత్త ఫీజు జూలై 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుంది. పెరగనున్న కార్ల ధరలు: జూలై 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చేలా పలు వాహన తయారీ సంస్థలు ధరల పెంపును ప్రకటించాయి. వీటిలో టాటా మోటార్స్, కియా మోటార్స్, ఎంజీ మోటార్స్, బీఎండబ్ల్యూ ఉన్నాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ) 1.5 శాతం ధర పెంపును ప్రకటించగా, టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ (సీవీ) 2.5 శాతం ధర పెంపును ప్రకటించింది. అంతేకాకుండా, కియా మోటార్స్, బీఎండబ్ల్యూ చెరో 2 శాతం ధర పెంపును ప్రకటించగా, ఎంజీ మోటార్స్ 3 శాతం ధర పెంపును ప్రకటించింది. క్రెడిట్ కార్డ్ నిబంధనలు మారనున్నాయి: అదనంగా జూలై 1 నుండి