అందరికీ నీతులు చెప్పే ప్రకాశ్ రాజ్ ఇలాంటి చర్యలకు పాల్పడడం విడ్డూరంగా ఉంది
Actor ProfileActor

అందరికీ నీతులు చెప్పే ప్రకాశ్ రాజ్ ఇలాంటి చర్యలకు పాల్పడడం విడ్డూరంగా ఉంది

Total News1
Movie Updates0
Sources1
అందరికీ నీతులు చెప్పే ప్రకాశ్ రాజ్ ఇలాంటి చర్యలకు పాల్పడడం విడ్డూరంగా ఉంది
AP7AM13 Jun 2026
అందరికీ నీతులు చెప్పే ప్రకాశ్ రాజ్ ఇలాంటి చర్యలకు పాల్పడడం విడ్డూరంగా ఉంది

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన 'ధర్మస్థల' పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రకాశ్ రాజ్ ప్రయత్నించారని, ఇదొక దిగ్భ్రాంతికరమైన, అవమానకరమైన చర్య అని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.ధర్మస్థలానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసేందుకు నటుడు ప్రకాశ్ రాజ్ కేరళ నుంచి ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు చేశారని 'చిన్నయ్య' అనే వ్యక్తి ఆరోపించిన విషయాన్ని విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తావించారు. తరచూ ఇతరులకు నైతికత, ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసాలు ఇచ్చే ప్రకాశ్ రాజ్ ఇలాంటి చర్యలకు పాల్పడటం విడ్డూరంగా ఉందన్నారు.ఈ వ్యవహారంలో నిజానిజాలు కచ్చితంగా బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ఆరోపణలు రుజువైతే, ప్రకాశ్ రాజ్ ఎంత పెద్ద నటుడైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. సెలబ్రిటీ హోదా అనేది చట్టపరమైన చర్యల నుంచి రక్షణ కవచం కాకూడదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని విష్ణువర్ధన్ రెడ్డి కోరారు