
Eenadu•29 Jun 2026
అల్పాహార పథకానికి విశేష స్పందన.. పెరిగిన విద్యార్థుల హాజరు శాతంతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బ్రేక్ఫాస్ట్ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో గతేడాది నుంచి ఉచిత అల్పాహార పథకం అమలు చేస్తున్నారు. దీంతో పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గతంలో తినకుండా స్కూలుకు వచ్చి ఇబ్బంది పడేవాళ్లమంటున్న విద్యార్థులు.. ప్రస్తుతం చదువుపై దృష్టి సారిస్తున్నామని చెబుతున్నారు. ఈ వార్త చదివారా: రాజ్నాథ్సింగ్తో సీఎం రేవంత్రెడ్డి భేటీ.. 20 నిమిషాలపాటు చర్చ