
హైదరాబాద్: అర్ధరాత్రి చికిత్స కోసం ఆస్పత్రికి వచి్చన ఓ మహిళ వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడింది. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ఎల్బీనగర్లోని శ్రేష్ఠ ఆరెంజ్ హాస్పిటల్కు శనివారం అర్ధరాత్రి వనస్థలిపురం ప్రాంతానికి చెందిన లలిత అనే మహిళ కడపునొప్పి ఉందంటూ అత్యవసర విభాగానికి వచి్చంది. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి పరీక్షలు నిర్వహించగా ఎలాంటి అనారోగ్య సమస్య లేదని నిర్ధారించారు. అయితే మహిళ ముందస్తు ప్రణాళికలో భాగంగా ఒక్కసారిగా ఆగ్రహానికి గురై వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషిస్తూ భౌతిక దాడికి పాల్పడింది. వెంటనే డయల్–100కు సమాచారం అందించగా పోలీసులు వచ్చారు. పోలీసులు అక్కడే ఉన్న సమయంలో కూడా సిబ్బందిపై దాడి చేసింది.అనంతరం తన కారును నడుపుకుంటూ వనస్థలిపురంలోని సహారా హాస్పిటల్కు వెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటన మొత్తం ఆసుపత్రి సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. నెల్లూరు : రొట్టెల పండుగకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు) విశాల్ ‘మకుటం’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) టాలీవుడ్ హీరోయిన్ బేబీ షవర్ సెలబ్రేషన్ (ఫొటోలు) 'ప్రేమమ్' హీరోయిన్ గోల్టెన్ బ్యూటీ (ఫొటోలు) ఒకప్పటి హీరోయిన్ మధుబాల.. ఖుష్బూ కూతురి పెళ్లిలో ఇలా (ఫొటోలు) అబ్బ కొడుకుల నాటకం.. ఒకడు పోలీసులను పంపుతాడు.. ఇంకోడు రౌడీలను పంపుతాడు..! సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. SIT కు కీలక రిపోర్టు ఇచ్చిన అంబటి