
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Ayodhya Ram Mandir: రామ మందిర హుండీ చోరీ కేసు విచారణను అధికారులు మరింత వేగవంతం చేశారు. గురువారం మధ్యాహ్నం బృందం మళ్లీ అయోధ్యకు చేరుకుని విచారణ కొనసాగించింది. గతంలో ట్రస్ట్ సభ్యులు తనిఖీలను తప్పించుకునేవారని, ఈ ఘటనలో భద్రతా సిబ్బందిని పట్టించుకోకుండా లెక్కింపు సిబ్బందిని దుర్వినియోగం చేస్తూ భారీ దొంగతనం జరిగిందని తేలింది. ఈ ఘటన తర్వాత ఆలయ భద్రతలో అనేక కీలక మార్పులు చేశారు. ఈ కానుకల దొంగతనం కేసులో పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. గురువారం పోలీసులు నిందితుడైన అవినాష్ శుక్లను తొలిసారిగా 13 గంటల పాటు రిమాండ్కు తీసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అవినాష్కు 48 గంటల రిమాండ్ కావాలని పోలీసులు కోరగా, కోర్టు 13 గంటల రిమాండ్ను మాత్రమే మంజూరు చేసింది. అవినాష్ శుక్ల రిమాండ్ పై గురువారం కోర్టు విచారణ జరిగింది. రిమాండ్ ఎందుకు అవసరమో పోలీసులు తమ వాదనలు వినిపించగా, కోర్టు ఆమోదించింది. జైలులో అవినాష్ను విచారించిన తర్వాత కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని, ఆ నేపథ్యంలో అతని రిమాండ్ అవసరమని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనికి ముందు ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ కుమార్ మిశ్రాను కూడా కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం ఆలయ నిర్వాహకుడు గోపాలరావును పిలిచి ప్రశ్నిచారు. భక్తులు విరాళంగా ఇచ్చిన బంగారు ఆభరణాలు, భూముల కొనుగోలుకు సంబంధించిన వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. ఆలయ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇచ్చిన వాంగ్మూలం సరిపోలిందో లేదో సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొందరు దాతలను, అలాగే భూముల కొనుగోలు