
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Amarnath Yatra 2026: దేశంలోనే అత్యంత పవిత్రమైన అమర్నాథ్ యాత్ర ఎంతో ప్రాముఖ్యత కలిగినది. సుమారు 3,800 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహలోని మంచు లింగాన్ని భక్తులు దర్శించుకోనున్నారు. ఈ యాత్ర భద్రత కోసం ఆర్మీ, జమ్మూ పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్ట్ హ్యాండ్ గవర్నర్ మనోజ్ సింహా గురువారం జమ్మూ నుండి ఈ యాత్రకు జెండా ఊపి ప్రారంభించారు. ఓల్డ్ మండిలోని శ్రీరామ్ ఆలయం నుండి పెద్ద సంఖ్యలో సాధువులు, రుషులు బాబా బార్ఫానీ నినాదాలు చేస్తూ ఈ యాత్రకు బయలుదేరారు. గవర్నర్ మనోజ్ సింహా ఎక్స్ (X) వేదికగా 'హర హర మహాదేవ' అంటూ యాత్ర ప్రారంభమైందని పంచుకున్నారు. పహల్గాం మార్గం గుండా.. అమర్నాథ్ యాత్ర నడక పహల్గాం నుండి బాల్తాల్ గుండా అమర్నాథ్ గుహ వైపు సాగుతుంది. ఈ మొత్తం దూరం 46 కిలోమీటర్లు కాగా, ట్రెక్కింగ్ పూర్తి చేయడానికి మూడు నుండి ఐదు రోజులు పడుతుంది. నడవలేని వారు పోనీలు లేదా పల్లకిలను ఉపయోగించుకోవచ్చు. బాల్తాల్ మార్గం తక్కువ దూరంగా ఉండటం వల్ల, అక్కడి నుండి అమర్నాథ్ గుహకు కేవలం 14 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. అమర్నాథ్ యాత్రకు అత్యంత కట్టుదిట్టుమైన భద్రత.. యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహల్గాం, బాల్తాల్ ట్రెక్కింగ్ మార్గాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎత్తైన కొండ శిఖరాలపై 22 ప్రత్యేక స్నైపర్ బృందాలను వ్యూహాత్మకంగా మోహరించారు. యాత్రికులు ఆ ప్రాంతాలకు చేరుకోకముందే ముప్పులను ఎదుర్కోవడానికి వీలుగా 24 గంటల నిఘా ఏర్పాటు చేశారు. 28 మాచన్ మోర్చాస్.. ఈసారి అమర్నాథ్ యాత్ర