హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఊహించని గ్రోత్ కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణ హైదరాబాద్లో భూముల ధరలు ఆకాశాన్నంటున్నాయి. కోకాపేట, రాయదుర్గం, నియోపోలిస్ లాంటి ఏరియాల్లో ఎకరం ధర రూ.250 కోట్లు దాటేసింది. రాయదుర్గంలో టీజీఐఐసీ శుక్రవారం నిర్వహించిన ఈ-వేలంలో ఎకరం రూ.264 కోట్ల రికార్డు ధర పలికింది. ఇదే ప్రాంతంలో మేలో ఎకరం రూ.237 కోట్ల ధర నమోదైంది. కాగా, కోకాపేట, నియోపోలిస్, రాయదుర్గం లాంటి ప్రాంతాల్లో కళ్లు చెదిరే టవర్లు నిర్మిస్తున్నారు సరే. మరీ నీటి సంగతేంటి..? ఆయా ప్రాంతాలు ప్రస్తుతం బోర్ వెల్స్ పైనే ఆధారపడి ఉన్నాయి. మరి భవిష్యత్తులో నీటి కొరత ఉండదా..? ఆయా ప్రాంతాల్లో నివసించే వారి నీటి అవసరాలు ఎలా తీరుతాయి..? ఆలోచిస్తే ఔను కదా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కోకాపేట నియోపోలిస్ ప్రాంతాల్లో నీటి లభ్యతపై ఓ నెటిజన్ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.'హైదరాబాద్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కొకాపేట్–నియోపోలిస్ ప్రాంతంలో భారీ సంఖ్యలో హై-రైజ్ భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మాణంలో ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో భవిష్యత్ నీటి అవసరాలు ఎలా తీరుతాయన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. ముఖ్యంగా నియోపోలిస్లో బోర్వెల్స్పై ఆధారపడే పరిస్థితి లేకపోవడంతో వేలాది కుటుంబాలకు నిరంతర తాగునీటి సరఫరా ఎలా సాధ్యమవుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ప్రాంతానికి నీటి సరఫరా కోసం స్థానిక బోర్వెల్స్ కంటే పెద్దస్థాయి మున్సిపల్ బల్క్ వాటర్ మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తున్నారు.నియోపోలిస్ ప్రాంతం సముద్రమట్టానికి సుమారు 588–592 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఎత్తు నీటి వనరు కాకపోయినా.. నీటిని ఎత్తైన ప్రాంతాల్లోని రిజర్వాయర్లలో నిల్వ చేసి సాంకేతికంగా సాధ్యమైన చోట గ్రావిటీ ఆధారంగా పంపిణీ చేయడానికి మౌలిక సదుపాయాల పరంగా అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల ప్రతి దశలో పంపింగ్పై ఆధారపడటాన్ని తగ్గించి విద్యుత్ వినియోగాన్ని కూడా నియంత్రించే అవకాశం ఉంటుంది. తాజా ప్రణాళికల ప్రకారం నియోపోలిస్–కొకాపేట్ ప్రాంతానికి భవిష్యత్ జనాభాను దృష్టిలో పెట్టుకుని సుమారు 226