
రవి అస్తమించని సామ్రాజ్యంగా 19వ శతాబ్దంలో ప్రపంచాన్ని శాసించిన యునైటెడ్ కింగ్డమ్ ఇప్పుడు నాలుగు ముక్కలు అయ్యే ముప్పును ఎదుర్కొంటోంది. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ స్వాతంత్య్రాన్ని సాధించుకోవడానికి సిద్ధపడుతుండటమే దీనికి కారణం. ఈ క్రమంలోనే ఈ మూడు ప్రాంతాల ఫస్ట్ మినిస్టర్ సోమవారం భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో ముగ్గురు ఫస్ట్ మినిస్టర్లు ఒక సంయుక్త ప్రకటనపై సంతకాలు చేయనున్నారు. ఇటీవల డబ్లిన్ పర్యటనకు వెళ్లిన ట్రంప్ సైతం ఐర్లాండ్ పునరేకీకరణ గురించి మాట్లాడారు.
Recommended for you

generalమట్టి గణపతిని పూజిద్దాం




