
వినాయక చవితి సందర్భంగా తిరుపతిలో ఓ భారీ విభూది గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో ఏకంగా ఏడు టన్నుల పవిత్ర విభూతితో 11 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ విభూది గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.





