
తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నకిలీ కార్డులతో జరుగుతున్న మోసాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు, 9 రకాల అత్యాధునిక భద్రతా ఫీచర్లతో కొత్త ఆహార భద్రతా కార్డులను (రేషన్ కార్డులు) జారీ చేయనుంది. దీని ద్వారా అక్రమాలకు తావులేకుండా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనాలు అందేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ కొత్త కార్డుల రూపకల్పనలో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. కార్డు ముందు భాగంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సంతకం ఉంటుంది. వెనుక భాగంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంతో కూడిన సెక్యూర్ హోలోగ్రామ్ను ముద్రిస్తారు. కార్డుపై 'గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ' అనే అక్షరాలు ఉబ్బెత్తుగా ఉంటాయి. చేతితో తాకినప్పుడు ఈ అక్షరాలను సులభంగా గుర్తించవచ్చు. దీనిని 'రిలీఫ్ టెక్స్ట్' టెక్నాలజీగా పేర్కొంటున్నారు.వీటితో పాటు, కంటికి స్పష్టంగా కనిపించని మరిన్ని ఫీచర్లను కూడా పొందుపరిచారు. కార్డుపై 'గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ' అనే వాక్యాన్ని అతి సూక్ష్మ అక్షరాలతో పదేపదే ముద్రిస్తారు. భూతద్దం సహాయంతో మాత్రమే వీటిని చూడగలం. వెలుతురుకు ఎదురుగా పట్టుకున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో కూడిన వాటర్మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది.అంతేకాకుండా, 'డ్యూయల్ హిడెన్ ఇమేజ్' అనే మరో ప్రత్యేక టెక్నాలజీని కూడా వాడుతున్నారు. కార్డును ఒక ప్రత్యేక కోణంలో చూసినప్పుడు 'జీవో టీజీ ఒరిజినల్' వంటి రహస్య గుర్తులు కనిపిస్తాయి. ఈ అధునాతన భద్రతాంశాల వల్ల కొత్త రేషన్ కార్డులను నకిలీ చేయడం దాదాపు అసాధ్యమని అధికారులు భావిస్తున్నారు. ఈ చర్యలతో ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత