హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు కీలక ప్రాంతాల మధ్య రాకపోకలను వేగవంతం చేయాలన్న లక్ష్యంతో చేపడుతున్న హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ) ప్రాజెక్టులో మరో కీలక ముందడుగుపడింది. హెచ్-సిటీలో భాగంగా చేపట్టనున్న మూడు ప్రధాన రహదారి మౌలిక వసతుల పనులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ బుధవారం జీవో 784ను జారీ చేసింది.ఈ పనులకు సంబంధించిన టెండర్ కాంట్రాక్టును కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్కు అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొత్తం రూ.231.87 కోట్ల ఐబీఎం విలువపై సంస్థ 4.68 శాతం అదనంగా రూ.242.72 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. ప్రభుత్వ ఆమోదంతో ఇప్పుడు కాంట్రాక్ట్ ప్రక్రియను పూర్తి చేసి పనులను ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. హెచ్-సిటీ ప్యాకేజీలో భాగంగా మొదటగా ఒవైసీ ఫ్లైఓవర్కు లెఫ్ట్ ఆర్మ్ డౌన్ ర్యాంప్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఫ్లైఓవర్ పరిసరాల్లో ట్రాఫిక్ కదలికలకు అనుగుణంగా అదనపు కనెక్టివిటీ అవసరం ఉన్న నేపథ్యంలో ఈ డౌన్ ర్యాంప్ కీలకంగా మారనుంది. ఫ్లైఓవర్పైకి, దిగువకు వెళ్లే వాహనాలకు మరింత సులభమైన రాకపోకలు కల్పించడం ద్వారా స్థానికంగా ట్రాఫిక్ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.దాంతో పాటుగా.. హఫీజ్బాబా నగర్ నుంచి బాలాపూర్–చర్చ్ రోడ్ వరకు ఆరు లైన్ల టూవే గ్రేడ్ సెపరేటర్ను నిర్మించనున్నారు. నగర దక్షిణ ప్రాంతంలో పెరుగుతున్న వాహన రద్దీకి అనుగుణంగా ఈ మార్గాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ప్రయాణ సమయం తగ్గించడంతో పాటు కీలక జంక్షన్ల వద్ద రద్దీని నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది. బండ్లగూడ–ఎర్రకుంట క్రాస్రోడ్ వద్ద ఆరు లైన్ల ఫ్లైఓవర్ను నిర్మించనున్నారు. ఈ ప్రాంతంలో స్థానిక ట్రాఫిక్, ప్రధాన మార్గాలపై నుంచి వచ్చే వాహనాల రాకపోకల కారణంగా ఏర్పడే రద్దీని తగ్గించేందుకు ఫ్లైఓవర్ ఉపయోగపడనుంది. ఈ మూడు పనులు పూర్తయితే నగర దక్షిణ, ఆగ్నేయ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడే