
భవన, ఇతర నిర్మాణ రంగాల్లోని కార్మికుల(బీవోసీడబ్ల్యూ) సెస్ కార్ప్సలో రూ.77 వేల కోట్ల మేరకు నిధులు మూలుగుతున్నాయని వాటిని ఖర్చు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ నిధులను కార్మికులకు పింఛను, వారి కుటుంబాల దీర్ఘకాలిక సంక్షేమం సహా.. సామాజిక భద్రతకు ఊతమిచ్చే ఇతర కార్యక్రమాలకు వినియోగించుకోవాలని కోరింది





