© 2026 nimisham.in

హైదరాబాద్ నగరం గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా ఎదిగే క్రమంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. బ్రిటన్కు చెందిన ప్రతిష్టాత్మక 'యూనివర్సిటీ ఆఫ్ లండన్', అమెరికాలోని బోస్టన్కు చెందిన 'నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ' తమ ఆఫ్షోర్ క్యాంపస్లను హైదరాబాద్లో నెలకొల్పనున్నాయి. ఈ రెండు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు భారత్లో తమ క్యాంపస్లను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' ప్రతినిధి బృందం బ్రిటన్లో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే, రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో, అధికారుల బృందం అగ్రరాజ్యంలో పర్యటించింది. ఈ పర్యటనల్లో భాగంగా నిర్వహించిన ఉన్నత స్థాయి చర్చలు సఫలీకృతం కావడంతో, ఈ ప్రఖ్యాత విద్యాసంస్థలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు అంగీకరించాయి.వీటితో పాటు, ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం సైతం తెలంగాణలో స్వల్పకాలిక 'ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్లు', విభిన్న కోర్సులను అందించేందుకు ఆసక్తి కనబరిచినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి అగ్రశ్రేణి విద్యాసంస్థలతో జరిపిన చర్చలు కూడా ఫలవంతమయ్యాయి.ఈ పరిణామంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు తెలంగాణతో భాగస్వామ్యం కావడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన కొనియాడారు. నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, విద్యపై ప్రత్యేక దృష్టి సారించి, రాష్ట్ర యువత విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్లోనే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన