
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాటింగ్ మూవీ ‘వారణాసి’. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆమె, సినిమాకి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇది క్రీ.పూ. 7000 నుండి క్రీ.శ. 2027 వరకు సాగే ఒక వినూత్నమైన సినిమా అని, రాజమౌళి ఒక కొత్త జోనర్నే క్రియేట్ చేశారని చెప్పారు. రాజమౌళి తనని బెస్ట్ వెర్షన్ లో చూపిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.





