చిన్నారుల్లో చాలా మందికి వివిధ రకాల అభిరుచులు ఉంటాయి. కొంతమందికి క్రికెట్ ఆడటం ఇష్టమైతే.. మరికొందరికి పాటల పాడటంపై ఆసక్తి ఉంటుంది. ఇంకొందరికి డిఫరెంట్ కలెక్షన్స్ సేకరించడం అంటే ఆసక్తి ఉండొచ్చు. ఉదాహరణకు కరెన్సీ నోట్లు, నాణేలు.. అలాగే పోస్టల్ స్టాంపులు. అయితే అలాంటి అభిరుచే ఇప్పుడు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందుకునే అవకాశం కల్పిస్తోంది. పోస్టల్ స్టాంపులు (తపాలా బిళ్లలు) వెనుక ఎంతో చారిత్రక నేపథ్యం ఉంటుంది. ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు, వారిలో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు తపాలా శాఖ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే దీన్ దయాళ్ స్పర్శ్ యోజన పేరుతో విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించే పోటీ నిర్వహిస్తున్నారు.అర్హతలు ఇవే.. 2026 -27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి నుంచి 9 వ తరగతి మధ్యన చదువుతున్న విద్యార్థులు ఇందుకు అర్హులు. అలాగే గత విద్యా సంవత్సరంలో 60 శాతానికి పైగా మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇందులో నుంచి 5 శాతం మినహాయింపు ఉంటుంది. విద్యార్థులు చదువుతున్న స్కూలులో ఫిలాటెలి క్లబ్ ఉంటే అందులో సభ్యత్వం ఉండాలి. ఒకవేళ లేకపోతే పోస్టాఫీసులో అకౌంట్ తెరవాల్సి ఉంటుంది.విద్యార్థులు సేకరించిన వివిధ రకాల పోస్టల్ స్టాంపులను ఒక లేఖకు జత చేసి, దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అర్హత కలిగిన వారికి సెప్టెంబర్ 30వ తేదీన రాత పరీక్ష, క్విజ్ నిర్వహిస్తారు. మరోవైపు ప్రతీ పోస్టాఫీస్ పరిధిలో 40 మంది విద్యార్థులను స్కాలర్ షిప్ కోసం ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన విద్యార్థులకు నెలకు రూ.500 చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అకౌంట్లో జమ చేస్తారు. ఇక జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన వారికి రూ.50 వేలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.25 వేలు, ముూడో స్థానం సాధించిన వారికి రూ.10 వేలు అందిస్తారు. అలాగే సర్కిల్ స్థాయిలోనూ విజేతలను ఎంపిక చేసి పారితోషకం అందిస్తారు.గడువు ఎప్పటి