
పొన్నం కుటుంబం ఉమ్మడి కుటుంబ విలువలను కాపాడుతూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొనియాడారు. రవీంద్రభారతిలో జరిగిన ‘పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాలు-2026’ కార్యక్రమంలో వ్యవసాయం, సాహిత్యం, జానపద కళారంగాల్లో ముగ్గురికి అవార్డులు అందజేశారు.





