
అమెరికా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం లొంగిపోయిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్లో విమర్శించారు. భారతీయ వస్తువులపై 100 శాతం టారిఫ్ విధించాలనుకుంటున్న అమెరికా ఒత్తిడిని అడ్డుకోవడంలో దేశ విదేశాంగ, వాణిజ్య విధానాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు.




