తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీ, తెలంగాణ మీదుగా పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వీటిని ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే తిరుగుతున్న ఈ ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజుల పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు గమనించి ఈ రైళ్లను ఉపయోగించుకోవాలని సూచించింది. హైదరాబాద్, వరంగల్, రాజమండ్రి, ఏలూరు, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, డోన్, నిజామాబాద్ వంటి ప్రాంతాల మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ చూద్దాం.