
హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో ఓటర్లకు మోసపూరిత ఎస్సెమ్మెస్లు, కాల్స్ వస్తున్నాయి. వాట్సప్లో పంపించే లింక్ ద్వారా ఫారం నింపాలంటూ సైబర్ నేరగాళ్లు (Cyber Crime) మోసానికి పాల్పడుతున్నారు. అలాంటి కాల్స్, మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్రెడ్డి సూచించారు. ఎన్యుమరేషన్ ఫారం, ఎన్నికల గుర్తింపు కార్డు రిజెక్ట్ అయినట్లు కొందరికి ఈ మెసేజ్లు వస్తున్నాయి. ఎన్యుమరేషన్ ఫారంలో వివరాలు సరిగా లేవని.. వాట్సప్లో పంపించే లింక్ ద్వారా ఫారం నింపాలంటూ సైబర్ నేరగాళ్లు పేర్కొంటున్నారు. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా రూ.5 చెల్లించాలని మోసం చేస్తున్నారు. లాగిన్ వివరాలు, పాస్వర్డ్, సీవీవీ, ఏటీఎం పిన్, బ్యాంకు వివరాలు అడుగుతున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. మోసపూరిత కాల్స్, ఎస్సెమ్మెస్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఈవో సూచించారు. ఎన్నికల సంఘం నుంచి ఓటర్లకు ఎలాంటి ఎస్సెమ్మెస్లు రావని.. ఈసీఐ, సీఈవో పేరుతో వచ్చే మెసేజ్లు, కాల్స్కు స్పందించవద్దని సూచించారు. అలాంటి కాల్స్, మెసేజ్లు వస్తే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు