
విఘ్నాలను తొలగించి, శుభాలను ప్రసాదించే పర్వదినం వినాయక చవితిని పర్యావరణహితంగా జరుపుకోవాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం వేర్వేరు ప్రకటనల్లో వారు ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.





