
అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీని బెంచ్‌కే పరిమితం చేసి.. సంజు శాంసన్‌ను తుది జట్టులో ఆడించింది భారత మేనేజ్‌మెంట్. సంజునేమో 10 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. దీంతో రెండో టీ20లో వైభవ్‌కు అవకాశాలు ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు. అయితే, గంభీర్‌కు సంజుపై గురి కాస్త ఎక్కువే. దీంతో వెంటనే అతడిపై వేటు పడే అవకాశాలు లేవని క్రికెట్ వర్గాల విశ్లేషణ. ఒకవేళ రెండో మ్యాచ్‌లోనూ సంజు విఫలమైతే మాత్రం మూడో టీ20లో కచ్చితంగా వైభవ్‌ ఉంటాడు.




