
ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడితో పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. ఏప్రిల్ నాటికి ఈ యుద్ధం ఉద్ధృతం కాగా.. ఇరాన్ శుద్ధిచేసిన యురేనియం నిల్వలు దాచిపెట్టిన అనుమానిస్తున్న ఇస్పహాన్ పర్వతాల సమీపంలోని రహస్య కేంద్రాలపై దాడికి అమెరికా ప్లాన్ చేసింది. ఏప్రిల్ 2 ఎఫ్-14ఈ యుద్ధ విమానాన్ని పంపింది. ఇంతలోనే ఇరాన్ సైన్యం భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణితో ఆ యుద్ధ విమానాన్ని కూల్చేయగా.. అందులోని ఇద్దరు పైలట్లు కిందకు దూకేశారు. వీరిలో ఒకరు శత్రు భూభాగంలో పడటంతో అతడి కోసం అమెరికా భారీ ఆపరేషన్ చేపట్టింది.



