© 2026 nimisham.in

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు (Hyderabad Metro)పై కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, మనోహర్లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) వేర్వేరుగా లేఖలు రాశారు. గత నెల 23, 24 తేదీల్లో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు కావడం లేదని వారి దృష్టికి తీసుకెళ్లారు. మెట్రో రైలుపై అధ్యయన బాధ్యతలు కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ఎస్బీఐ క్యాప్స్కు అప్పగించాలని కోరారు. దీనికి సంబంధించిన షరతులు, విధివిధానాలను వెంటనే ఖరారు చేయాలన్నారు. మెట్రో మొదటి దశ స్వాధీనం, రెండో దశకు అనుమతుల్లో జాప్యం జరుగుతోందని కేంద్రమంత్రులకు రాసిన లేఖలో సీఎం పేర్కొన్నారు. ఈ జాప్యం వల్ల మెట్రో ఫేజ్-1 నిర్వహణలో రోజువారీ ఇబ్బందులు, అనిశ్చితి ఎదురవుతున్నాయన్నారు. ఫేజ్-2 డీపీఆర్ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు. దీని ఫలితంగా ప్రాజెక్టు అమలు మరింత ఆలస్యం కావడంతో పాటు వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. కేంద్రమంత్రులు వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.