
రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొండా సురేఖపై తీవ్ర ఆగ్రహం మంత్రి పదవి ఊడే అవకాశం Cm Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం ఉదయం హస్తినకు చేరుకున్న సీఎం, మధ్యాహ్నం పలువురు కేంద్ర మంత్రులతో రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించనున్నారు. అయితే ఈ పర్యటనలో ప్రధానంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిల వ్యవహారంపై ఏఐసీసీ అధిష్ఠానంతో కీలక చర్చలు జరగనున్నాయి. పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాంగ్రెస్ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోనుంది. Telangana Rains: తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక! అధిష్ఠానంతో సమావేశం - పీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదికపై చర్చ: సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) బుధవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లతో భేటీ కానున్నారు. కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి, ఆమెను మంత్రివర్గం నుండి తప్పించడమే లక్ష్యంగా అధిష్ఠానం వద్ద పట్టుబట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా ఇప్పటికే సీఎం ఈ విషయంపై వివరంగా చర్చించినట్లు సమాచారం. మంత్రివర్గం నుంచి తప్పించే యోచన - పొంచి ఉన్న రాజకీయ మార్పులు: కొందరు కాంగ్రెస్ నాయకులు సురేఖకు మద్దతుగా ఇన్ఛార్జ్తో మాట్లాడినప్పటికీ, అధిష్ఠానం నుండి ఎలాంటి సానుకూల హామీ లభించలేదు. కొత్త మంత్రుల చేరిక లేదా మంత్రివర్గ విస్తరణకు మరికొంత సమయం పట్టినా, సురేఖను పదవి నుంచి తొలగించే విషయంలో సీఎం ఏమాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనిపిచడం లేదు. ఒకవేళ ఏఐసీసీ పెద్దలు సీఎంబో నివారించే ప్రయత్నం చేస్తే తప్ప, కొండా సురేఖ