
మొగల్తూరు: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఇంకా బాగా జరగాలి.. అందుకోసం సలహాలు, సూచనలు చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఏర్పాటుచేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమం పేదవాడిని నిలబెట్టాలి.. తాత్కాలిక ఉపశమనం ఉండాలన్నారు. ‘‘ఆడ బిడ్డలు ఎక్కడికి వెళ్లాలన్నా.. ఉచిత బస్సులు తెచ్చాం. దీపం పథకం ద్వారా 3 సిలిండర్లు ఇస్తున్నాం. పేదల సేవ కోసమే మొగల్తూరు వచ్చాను. సీఎం స్థాయిలో అనేక మార్పులు చేశాను. ఎంత సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను. అనేక సంస్కరణలకు నాంది పలికాం.. ప్రజా చైతన్య కార్యక్రమాలు తెచ్చాం. ఎన్నికల్లో మీరిచ్చిన తీర్పును ఎన్నటికీ మర్చిపోలేను. వైకాపా హయాంలో రాష్ట్రానికి కోలుకోలేని నష్టం జరిగింది. కూటమిగా ఏర్పడి రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడుతున్నాం. 45 సంవత్సరాలుగా వెనుకబడిన వర్గాలు తెదేపాని అంటిపెట్టుకునే ఉన్నాయి. ఆర్టీసీలో మహిళా కండక్టర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. త్వరలో మహిళా డ్రైవర్ల వ్యవస్థను తీసుకొస్తాం. వడ్డెర సమాజిక వర్గానికి మైనింగ్ లీజులు పెట్టాం. గౌడ్ కులానికి మద్యంషాపులు కేటాయిస్తున్నాం. డీఎస్సీపై వైకాపా 350 కేసులు వేసింది. వైకాపా చేస్తోన్న ప్రచారాన్ని డీఎస్సీ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పింఛన్లు పెంచాం. పేదల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. పేదలకు చేయూతనిస్తే ఏదైనా సాధించే సత్తా ఉంటుంది’’ అని చంద్రబాబు అన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం