
అమరావతి: సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రం 15శాతం వృద్ధిరేటు సాధించేలా సమగ్ర కార్యాచరణ రూపొందించి, ప్రజలపై ధరల భారం పడకుండా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రణాళిక విభాగం సమర్పించిన 2026 జులై ఆర్థిక నివేదికను పరిశీలించిన ఆయన, ప్రతి ప్రభుత్వశాఖ అత్యున్నత లక్ష్యాలను చేరుకునేలా వనరుల సమర్థ నిర్వహణ చేపట్టాలని సూచించారు. నీటి లభ్యత, ఉత్పత్తుల విలువ జోడింపుపై జిల్లా, నియోజకవర్గం, మండలాల వారీగా కంటింజెన్సీ ప్రణాళికలు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. నివేదిక ప్రకారం.. 2025-26 రెండో త్రైమాసికంలో 10.7 శాతం, వాస్తవ వృద్ధిరేటులో 9.9 శాతంతో గత రెండేళ్లుగా జాతీయ సగటు కంటే మెరుగైన ప్రగతిని నమోదు చేసింది. రంగాల వారీగా వ్యవసాయంలో 13.5 శాతం, పారిశ్రామికంలో 10.6 శాతం, సేవల రంగంలో 9.9 శాతం వృద్ధి నమోదైంది. సాంకేతికత అనుసంధానంతో జీఎస్టీ వసూళ్లు 21శాతం పెరిగి రూ.13,282 కోట్లకు, సాధారణ ఎగుమతులు రూ.16,322 కోట్లకు చేరాయి. వీటితో పాటు ఎస్టీపీఐ ఎగుమతులు 32.2శాతం, వాణిజ్య వాహనాల నమోదు 51.6శాతం మేర పెరగ్గా, రూ.2.88 లక్షల కోట్ల మెగా ప్రాజెక్టుల పెట్టుబడుల గ్రౌండింగ్లో 75.4 శాతం పురోగతి సాధించినట్లు వెల్లడైంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు