
బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026ను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ నేత, మాజీ విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న సంక్షోభాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ బ్రిక్స్ సభ్య దేశాలు ఏకాభిప్రాయంతో కూడిన ప్రకటన చేయడం హర్షణీయమని ఖుర్షీద్ అన్నారు.





