
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్ శశాంక్ సింగ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన తండ్రి శైలేష్ సింగ్ తీవ్రమైన ఆరోపణలతో చిక్కుల్లో పడ్డారు.
తమ ఇంట్లో వంట చేసే వ్యక్తిపై దాడి చేసి, దుర్భాషలాడారన్న ఆరోపణలపై వీరిద్దరిపై మధ్యప్రదేశ్లోని భోపాల్లో కేసు నమోదైంది. బాధితుడు విపేంద్ర సింగ్ తోమర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాతిబాద్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఉద్యోగం పేరుతో నమ్మించి..బాధితుడు విపేంద్ర సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. రేవాకు చెందిన అతడిని ఇటీవల ఓ పరిచయస్తుడి ద్వారా భోపాల్లోని నిల్బాద్ ప్రాంతంలో ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్ బంగ్లాలో పనికి కుదిర్చారు. నెలకు రూ.15,000 జీతంతో పాటు ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని, భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించడానికి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలతో నమ్మి అతను పనిలో చేరాడు.అయితే, ఉద్యోగంలో చేరిన కొన్ని గంటల్లోనే పరిస్థితి మారిపోయింది. తాను వండిన ఆహారం నాణ్యతగా లేదంటూ యజమానులు తనపై తీవ్ర మానసిక ఒత్తిడి తీసుకువచ్చి, దూషణలకు దిగారని విపేంద్ర సింగ్ ఆరోపించాడు. ఈ వేధింపులు భరించలేక, ఉద్యోగం మానేసి తిరిగి తన స్వగ్రామానికి వెళ్లిపోతానని చెప్పడంతో గొడవ పెద్దదైంది.ఫోన్ లాక్కొని, గదిలో బంధించి దాడితాను వెళ్లిపోతానని చెప్పడంతో శశాంక్ సింగ్, ఆయన తండ్రి శైలేష్ సింగ్ ఆగ్రహంతో ఊగిపోయారని బాధితుడు తెలిపాడు. తాను ఎవరితోనూ మాట్లాడకుండా ఉండేందుకు తన మొబైల్